‎టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్

India To Launch Communication Satellite GSAT 24 for Tata Sky - Sakshi

యూరోపియన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఏరియన్ స్పేస్'కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల జీశాట్-24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రభుత్వ రంగ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) నిర్ణయించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్మించిన ఈ నాలుగు టన్నుల క్లాస్ కమ్యూనికేషన్-బ్యాండ్ ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎన్ఎస్ఐఎల్ చేత తయారు చేయబడిన పూర్తి స్థాయి జీశాట్-24 ఉపగ్రహాన్ని 2022 మొదటి త్రైమాసికంలో ప్రయోగించాలని భావిస్తున్నారు. 

డిటిహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చడం కోసం మొత్తం జిశాట్-24 ఉపగ్రహాన్ని టాటా స్కైకి లీజుకు ఇచ్చారు. జిశాట్-24 ఉపగ్రహాన్ని ఎన్ఎస్ఐఎల్ వాణిజ్య ప్రాతిపదికన స్వంతం చేసుకుని నడుపుతుంది. గతంలో అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఛైర్మన్ కె. శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో తయారు చేసిన జిశాట్ 20, జిశాట్ 22, జిశాట్ 24 అనే మూడు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాలను కొనుగోలు చేయడమే కాకుండా వాటిని లీజుకు తీసుకోవచ్చు. (చదవండి: లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం)

ప్రభుత్వ రంగ అంతరిక్ష వాణిజ్య సంస్థ న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఉపగ్రహాలు, వాహక నౌకల తయారీ కోసం పెట్టుబడుల పెడుతుంది. వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల వ్యయంతో తమదైన సొంత వాహక నౌకలను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ జి.నారాయణన్‌ బెంగళూరులో ప్రకటించారు. రిమోట్‌ సెన్సింగ్‌, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను సైతం కొనుగోలు/లీజుకు తీసుకుంటుంది. వచ్చే ఏడాది డీటీహెచ్‌(టాటా స్కై), బ్రాడ్‌ బ్యాండ్‌ సంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రయోగిస్తామన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 342 సంస్థలు ఎన్‌ఎస్‌ఐఎల్‌తో ఒప్పందాలు కుదుర్చుకోగా వాటిల్లో అత్యధిక సంస్థలు అమెరికాకు చెందినవని నారాయణ్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top