పసిడి ప్రియుల ఆనందం కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం (ఆగస్టు 23) పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 
బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.200 తగ్గి రూ.66,600 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 క్షీణించి రూ. 72,650 వద్దకు దిగివచ్చింది.
ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 తరిగి రూ.66,750లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.72,800 లకు వచ్చింది.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు రెండు రోజుల తర్వాత దిగివచ్చాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా ధరలు నేడు కాస్తంత తగ్గాయి. హైదరాబాద్లో శుక్రవారం రూ.300 మేర క్షీణించింది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,700 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
