సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్‌! | Evtric Motors Reaches 100 Dealerships Pan India | Sakshi
Sakshi News home page

సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్‌!

May 12 2022 6:52 PM | Updated on May 12 2022 6:52 PM

Evtric Motors Reaches 100 Dealerships Pan India - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్ సంస్థ ఈవిట్రిక్‌ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా 100 డీలర్‌ షిప్‌లను పూర్తి చేసుకుందని ఆ సంస్థ ఫౌండర్‌ మనోజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిట్రిక్‌ మోటార్స్‌ 6 నెలల కాలంలోనే  దేశ వ్యాప్తంగా 100కు పైగా డీలర్‌ షిప్‌ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం ఈవీట్రిక్‌ స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయని తెలిపారు. మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్‌పూర్, బికనీర్, సూరత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సత్తా చాటుందని అన్నారు.   

ఇక దేశంలో పెరిగిపోతున్న పెట్రో ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం పెరిగిపోతుందని, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కొనుగోలు దారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈవిట్రిక్‌ ఫౌండర్‌ మనోజ్ పాటిల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement