
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును (PF) పూర్తిగా విత్డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్వో ఆమోదం తెలిపింది. ఈమేరకు నిబంధనలను సరళీకృతం చేసింది.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన ఈపీఎఫ్వో సీబీటీ 238వ సమావేశం సోమవారం జరిగింది. సరళీకృత పాక్షిక ఉపసంహరణలు, వ్యాజ్యాలను తగ్గించడానికి, సభ్యుల సౌలభ్యాన్ని పెంచడానికి విశ్వాస్ పథకాన్ని ప్రారంభించడంతో సహా ప్రధాన సంస్కరణలను ఈ సమావేశంలో ఆమోదించారు.
సరళీకృత ఈపీఎఫ్ ఉపసంహరణలు
- 13 సంక్లిష్ట ఉపసంహరణ నిబంధనలను 3 వర్గాలుగా విలీనం చేస్తూ నిర్ణయించారు. అవి.. ఆవశ్యక అవసరాలు( అస్వస్థత, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు
- సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యజమాని విరాళాలతో సహా అర్హత కలిగిన బ్యాలెన్స్ లలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
- విద్య ఉపసంహరణలు 10 సార్లు, వివాహ ఉపసంహరణలు 5సార్లు వరకు అనుమతిస్తారు.
- కనీస సేవా వ్యవధిని 12 నెలలకు తగ్గించారు.
- రిటైర్ మెంట్ కార్పస్ ను కాపాడటానికి 25% కనీస బ్యాలెన్స్ ను నిర్వహించాలి.
- అకాల ఫైనల్ సెటిల్మెంట్లు 2 నుండి 12 నెలల వరకు పొడిగించారు.
- ఆధార్ ఆధారిత ధృవీకరణతో తుది పెన్షన్ ఉపసంహరణ ఇప్పుడు సాధ్యమవుతుంది.
విశ్వాస్ పథకం
ఈపీఎఫ్ఓ, యజమాన్యాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా రూపొందించిన విశ్వాస్ పథకానికి ఈపీఎఫ్వో సీబీటీ ఆమోదం తెలిపింది. ఇది జరిమానా నష్టాలకు వన్ టైమ్ సెటిల్ మెంట్ విండోను అందిస్తుంది. స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహిస్తుంది. ఇరువైపులా చట్టపరమైన భారాన్ని తగ్గిస్తుంది.
ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
30 కోట్ల మందికి పైగా సభ్యులకు డిజిటల్ సాధికారత కల్పించడంపై ఈపీఎఫ్వో సీబీటీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కాగిత రహిత ప్రక్రియలు, రియల్ టైమ్ ఫిర్యాదుల పరిష్కారం, ఏఐ-ఆధారిత సర్వీస్ డెలివరీ వంటిని అమలు చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్