దుబాయ్‌ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా.. | Dubai 5 Year Multiple Entry Visa For Indians | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా..

Feb 23 2024 5:45 PM | Updated on Feb 23 2024 6:06 PM

Dubai 5 Year Multiple Entry Visa For Indians - Sakshi

దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందిన వారు ఐదు సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ సదుపాయాన్ని పొందుతారు.

భారత్ నుంచి 2023 సంవత్సరంలో ఏకంగా 2.46 మిలియన్ల మంది దుబాయ్ వెళ్లినట్లు, ఈ సంఖ్య కరోనా వ్యాపించడానికి ముందు రోజుల కంటే 25 శాతం ఎక్కువని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 2023లో మొత్తం 17.15 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించారు.

2022 ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన వారు 1.84 మిలియన్స్ కాగా.. 2019లో ఈ సంఖ్య 1.97 మిలియన్స్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 2022లో దుబాయ్ వెళ్లిన పర్యాటకుల సంఖ్య 14.36 మిలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 2022లో కంటే గత ఏడాది ఎక్కువ మంది దుబాయ్ సందర్శించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కాబోయే కోడ‌లి కోసం ఖ‌రీదైన కానుక‌లు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..
 
ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసా అభ్యర్థన స్వీకరించిన తరువాత అన్ని విధాలా ఆమోదం పొందితే.. కేవలం 2 నుంచి 5 పనిదినాల్లో వీసా జారీ చేస్తారు. ఈ వీసా పొందిన తరువాత సంవత్సరంలో 180 రోజులు లేదా 3 నెలలు దుబాయ్‌లో ఉండవచ్చు. అయితే వారు ప్రతి 90 రోజులకు ఒకసారి అనుమతి పొందాల్సి ఉంటుంది. 180 రోజులు దుబాయ్‌లో ఉంటే రెండు సార్లు అనుమతి పొందాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement