న్యూఢిల్లీ: ప్యూర్ ప్లే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కార్యకలాపాల నుంచి వైదొలిగినట్లు డ్రీమ్11 వెల్లడించింది. ఇకపై పూర్తి స్థాయి గ్లోబల్ స్పోర్ట్స్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫాంగా మారనున్నట్లు తెలిపింది. స్పోర్ట్స్ కంటెంట్, లైవ్ స్ట్రీమింగ్, స్టాటిస్టిక్స్, స్కోర్స్, కామెంటరీ మొదలైన వాటిపై దృష్టి పెట్టనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లకు ఇష్టమైన క్రీడలు, జట్లు, ఆటగాళ్లకు సంబంధించిన కంటెంట్ను వ్యక్తిగత స్థాయిలో అందించేలా ఏఐ–ఫస్ట్ ప్లాట్ఫాంగా రూపొందుతున్నట్లు వివరించింది.


