న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది.
ఎఫ్డీఐ మార్గంలో
విదేశీ పోర్ట్ఫోలియో(ఎఫ్పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్బీఐ పరిమితులు విధించింది.
చర్చల దశలో
యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్కల్లా ఎస్బీఐ కార్డ్స్లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది.
యస్ బ్యాంక్లో కార్లయిల్ గ్రూప్
Published Sat, Jun 18 2022 6:17 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement