5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏథర్ మైలురాయి | Ather Energy Crosses 5 Lakh Unit Production Milestone | Sakshi
Sakshi News home page

5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏథర్ మైలురాయి

Oct 6 2025 5:23 PM | Updated on Oct 6 2025 6:04 PM

Ather Energy Crosses 5 Lakh Unit Production Milestone

బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5 లక్షలవ వాహనాన్ని రోల్-అవుట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఉత్పత్తి మైలురాయిని సాధించినట్లు ఏథర్ప్రకటించింది. ఈ మైలురాయి వాహనం ఏథర్ ఫ్లాగ్‌షిప్ ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా.

5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్‌కు ఒక ప్రధాన మైలురాయి. మా మొట్టమొదటి ప్రోటోటైప్ నుండి నేటి వరకు, మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు, స్కేలబుల్, నమ్మకమైన, స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది” అని ఏథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.

ఏథర్ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఒకటి వాహన అసెంబ్లీ కోసం, మరొకటి బ్యాటరీ ఉత్పత్తి కోసం. హోసూర్ ప్లాంట్ సంవత్సరానికి 4,20,000 స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఏథర్ తన మూడవ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement