
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 148వ కోర్సు నుండి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు రికార్డ్ సృష్టించారు. కఠినమైన తమ శిక్షణనువిజయవంతంగా పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత 17 మంది మహిళా క్యాడెట్లు జోష్ పుష్-అప్లతో ఔరా అనిపించారు. 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో పాటు పదిహేడు మంది మహిళా క్యాడెట్లు అకాడమీ నుండి గ్యాడ్యుయేట్ కావడం విశేషం.
పుణేలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ చీఫ్ , మిజోరాం ప్రస్తుత గవర్నర్ జనరల్ వీకే సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్ష అధికారిగా ఉన్నారు. అకాడమీ క్యాడెట్ కెప్టెన్ ఉదయవీర్ నేగి 148వ కోర్సు కవాతుకు నాయకత్వం వహించారు. "ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు, ఎన్డిఎ నుండి మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుందని, ఇదిమరింత మంది మహిళలు చేరడానికి, వారి సాధికారత వైపు సాగేలా చారిత్రాత్మక మైలురాయి లాందని జనరల్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.వీరు "నారి శక్తి"కి బలమైన చిహ్నం, ఇది మహిళల అభివృద్ధిని మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాదు ఇది ఈ క్యాడెట్ల అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానన్నారు.
#WATCH | Maharashtra | Female cadets celebrate after their 'Passing Out Parade’ held at Pune, which was reviewed by Mizoram Governor and former Chief of the Army Staff VK Singh
The first batch of 17 female cadets graduated from the National Defence Academy (NDA) along with over… pic.twitter.com/yCnDU3SiLL— ANI (@ANI) May 30, 2025
తమకు జెండర్ అనేది తమకు ఎపుడూ అడ్డంకి కాలేదనీ క్యాడెట్ ఇషితా శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరం కష్టనష్టాల్ని పంచుకుంటూ అచంచలమైన విశ్వాసం, వైఖరితో ఐక్యతా స్ఫూర్తిని స్వీకరించా మన్నారు.

2021లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యుపీఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మహిళలు డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన తర్వాత ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ 2022లో ఎన్డిఎ 148వ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ మహిళా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు NDA లో మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. శఙక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ఎంపిక చేయబడతారు.