సేమ్‌ షాక్‌: ఎయిర్‌టెల్‌లోనూ ఆ ప్లాన్‌ కనుమరుగు | Airtel follows Jio discontinues Rs 249 recharge plan | Sakshi
Sakshi News home page

సేమ్‌ షాక్‌: ఎయిర్‌టెల్‌లోనూ ఆ ప్లాన్‌ కనుమరుగు

Aug 20 2025 9:34 PM | Updated on Aug 20 2025 9:38 PM

Airtel follows Jio discontinues Rs 249 recharge plan

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ తన ఎంట్రీ సెగ్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ప్రత్యర్థి సంస్థ జియో కూడా రూ.249 ధర గల ఎంట్రీ లెవల్ ప్లాన్ ను నిలిపివేసింది. ఎక్కువ మంది రీచార్జ్చేసుకునే ఈ ప్లాన్ ను ఎయిర్‌టెల్ నిశ్శబ్దంగా కనుమరుగు చేసింది. ఇప్పుడు వారు రూ .299 ధర గల ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవలసి వచ్చింది.

ఎయిర్ టెల్ నిలిపివేసిన ఈ ప్లాన్ ధర రూ.249. ఇది 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందించేది. ముఖ్యంగా, ఇది వినియోగదారులకు ఉచిత హలోట్యూన్స్, ప్రో ఏఐ, ఎక్స్ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలను కల్పించేది. 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే రూ.249 ప్లాన్ ను జియో కూడా ఇటీవల తొలగించింది. జియోలో ఇకపై 1 జీబీ రోజువారీ డేటా లిమిట్తో ఎలాంటి ప్లాన్ లేదు. చౌకైన 28 రోజుల ప్లాన్ ఇప్పుడు రూ .299 నుండి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.

ఈ చర్య ఎయిర్ల్, జియోలకు సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుతుండగా, సామాన్యులపై ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ భారం పడుతోంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రైవేట్టెలికం కంపెనీ వొడాఫోన్ఐడియా కూడా అనుసరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement