పాల్వంచ: ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడాలని, వైటీపీఎస్లో ప్రైవేట్ టెండర్లను నిలిపివేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 5,6,7 దశల సెక్రటరీలు ప్రవీణ్ కుమార్, బట్టు హరీష్, బి.రవి అన్నారు. సోమవారం కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. రామకృష్ణజాదవ్, సమీర్ అహ్మద్, కృష్ణయ్య, వంశీ, సురేష్, రామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు నాయకులు డి.ఉమా మహేశ్వరరావు, యాస్మీన్, రఘువీర్,మహేష్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


