ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం ప్రజ ల్లో సామాజిక బాధ్యతనే కాక పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంపొందిస్తోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయప్రతాప్ అన్నారు. ఖమ్మంలోని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ నివాసంలో ఆదివారం మన్ కీ బాత్ను నాయకులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉదయప్రతాప్ మాట్లాడుతూ.. సహజసిద్ధమైన బ్రిడ్జిల విశిష్టత, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను మోదీ వివరించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జ్వాలా నర్సింహారావు, మేకల నాగేందర్, దాసరి మధు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.


