భద్రాచలానికి సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో స్థలాన్ని పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, అనుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి ఫీజుబులిటీ రిపోర్టును పది రోజుల్లోగా ఇవ్వాలంటూ ఏవియేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


