రుద్రంపూర్: ఆర్సీహెచ్పీలోని రైల్వే సైడింగ్లలో బొగ్గు రవాణాపై సింగరేణి కోల్మూవ్మెంట్ ఈడి బి.వెంకన్న సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఆయన ఆర్సీహెచ్ని సందర్శించారు. బొగ్గు రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచలు చేశారు. అనంతరం ఏరియా జీఎం నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం. శాలేంరాజు, ఇతర అధికారులు గోవిందరావు, తిరుపతి, బీభత్స, రాజారాం తదితరులు పాల్గొన్నారు.


