సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు | Ysrcp Leaders Inspect Accident Site In Simhachalam | Sakshi
Sakshi News home page

సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు

May 1 2025 1:20 PM | Updated on May 1 2025 1:40 PM

Ysrcp Leaders Inspect Accident Site In Simhachalam

సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో ప్రమాద స్థలిని వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌ పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందన్నారు. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.

కాగా, భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ పదవులపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు.. భక్తుల భద్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా చందనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు.. కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపారు. మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై చూపిన శ్రద్ధ భక్తుల భద్రతపై చూపకపోవడంతో కూటమి నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement