AP: వైఎస్‌ఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు | Ys Rajashekarareddy Death Anniversery Progrmmes Ap Wide | Sakshi
Sakshi News home page

AP: వైఎస్‌ఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు

Sep 2 2024 10:45 AM | Updated on Sep 2 2024 12:35 PM

Ys Rajashekarareddy Death Anniversery Progrmmes Ap Wide

సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.  సోమవారం(సెప్టెంబర్‌2) వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి ‌వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. 

వైఎస్‌ఆర్‌కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్స

  • వైఎస్‌ పేరు చెప్పగానే అనేక  సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.
  • ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.
  • అన్ని వర్గాల ప్రజలకు వైఎస్‌ హయాంలో మేలు జరిగింది.
  • పార్టీలకతీతంగా వైఎస్‌ను ప్రజలు ఆరాధిస్తారు.
  • వైఎస్‌ అడుగుజాడల్లోనే వైఎస్‌జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.
  • వైఎస్‌ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాం

ప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు

  • పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.
  • వైఎస్‌ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.
  • మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి

వైఎస్‌ఆర్‌ జిల్లాలో.. 

వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వై‌ఎస్‌ఆర్‌ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన 

 

 

Advertisement
 
Advertisement
Advertisement