సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr | Sakshi
Sakshi News home page

సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 12:32 PM

YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr

వైఎస్‌ జగన్‌ ఇప్పట్ల పర్యటన అప్‌డేట్స్‌.. 

సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

  • ఇప్పట్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్
  • ఇటీవల మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

పార్నపల్లి నిర్వాసితులకు భరోసా.. 

  • కడప
  • పార్నపల్లి రహదారిపై వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజారెడ్డి కాలనీ వాసులు..
  • జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన.
  • పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన
  • పరిహారం ఇప్పించి ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌కు వినతి.
  • న్యాయం కోసం పోరాటం చేద్దాం.
  • న్యాయం జరగకపోతే మూడేళ్లు ఆగండి మనం అధికారంలోకి వస్తాం..
  • తప్పకుండా న్యాయం చేస్తామన్న వైఎస్ జగన్
  • మీకు అన్యాయం జరగదు.. జగన్ సార్ చూసుకుంటాడని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా

 

ఇప్పట్ల బయలుదేరిన వైఎస్‌ జగన్‌

  • పులివెందులలో తన నివాసం నుంచి ఇప్పట్ల బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్
  • మరికాసేపట్లో ఇప్పట్ల చేరుకోనున్న వైఎస్ జగన్
  • ఇప్పట్ల లో ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
  • అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు వైఎస్ జగన్
  • క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ


👉లింగాల మండలం ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్

👉వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

👉వైఎస్‌ జగన్‌ పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement