నేడు సుధాకర్‌రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr | Sakshi
Sakshi News home page

నేడు సుధాకర్‌రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:21 AM

YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయంపులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.25గంటల వరకు ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement