సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.


