
సాక్షి, తాడేపల్లి: దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఆయన సందేశం విడుదల చేశారు. ‘‘మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Muharram
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025