
సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు .
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2024