
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్) ఆస్పత్రిలో కరెంటు సరఫరాలో ఎక్కడా ఆటంకం లేదని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. పవర్ సప్లై ఆగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
విమ్స్లో కరెంటు నిరంతరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పేషెంట్లు తప్పుడు ప్రచారాలని నమ్మి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.