నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా | Vijayawada Police Are Imposing Fines Who Dont Follow Covid Rules | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి

Jul 27 2020 8:45 PM | Updated on Jul 27 2020 8:47 PM

Vijayawada Police Are Imposing Fines Who Dont Follow Covid Rules - Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై విజయవాడ నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోమవారం రోజున రామవరప్పాడులో ట్రాఫిక్‌ ఏడీసీపీ రవిచంద్ర స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించి మాస్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రవిచంద్ర మాట్లాడుతూ.. నెల రోజుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10,805 మందిపై కేసులు నమోదు చేశాము. మొత్తంగా వారికి రూ. 8,83,600 జరిమానా విధించాము. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. నిర్లక్ష్యం వహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము' అని రవిచంద్ర పేర్కొన్నారు. (పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement