యారాడ బీచ్‌లో నేవీ ఉద్యోగుల గల్లంతు | Two Navy Employees Missed In Yarada Beach Visakhapatnam | Sakshi
Sakshi News home page

యారాడ బీచ్‌లో ఇద్దరు నేవీ ఉద్యోగుల గల్లంతు

Nov 8 2020 7:49 PM | Updated on Nov 8 2020 8:19 PM

Two Navy Employees Missed In Yarada Beach Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ నేవీ షిప్ సుమిత్రలో పనిచేస్తున్న 30 మంది నావికా సిబ్బంది ఆదివారం యారాడ బీచ్‌ సందర్శనకు వెళ్లారు. వీరిలో జగత్ సింగ్, శుభమ్‌ అనే ఇద్దరు నౌకా సిబ్బంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే నావీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా జగత్ సింగ్ మృతదేహం లభించింది. శుభం ఆచూకీ ఇంకా లభించలేదు. అతనికోసం హెలికాప్టర్ ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.  (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!)


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement