ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు
కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ బయట అప్పులు రూ.55,383 కోట్లకు చేరిక
ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. తాజాగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్సీఎల్) సంస్థలకు అవసరమైన బొగ్గు, విద్యుత్ కొనుగోలు కోసమంటూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో) నుంచి ప్రభుత్వం రూ.5,000 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

హడ్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి రూ.5,000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకుముందు ఏపీపీఎఫ్సీఎల్ తీసుకున్న రూ.710 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చింది. దీంతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.5,710 కోట్లకు చేరింది. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెట్ బయటచేసిన అప్పులు రూ.55,383 కోట్లకు చేరాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగీ చేసి.. దు్రష్పచారం చేశాయి. ఇప్పుడు ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
