దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు | Special trains for Dussehra festival | Sakshi
Sakshi News home page

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

Oct 22 2023 5:12 AM | Updated on Oct 22 2023 6:04 AM

Special trains for Dussehra festival - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా సీజన్‌లో రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రగచ్చి–బెంగళూరు (06286) రైలు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుతుంది. చైన్నై సెంట్రల్‌–భువనేశ్వర్‌ (06073) రైలు ఈ నెల 23, 30, నవంబర్‌ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈ నెల 24, 31, నవంబర్‌ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుతుంది. 

చెన్నై సెంట్రల్‌–సత్రగచ్చి (06071) రైలు ఈ నెల 28, నవంబర్‌ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్రగచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈ నెల 23, 30, నవంబర్‌ 6 తేదీల్లో ఉదయం 5 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. భువనేశ్వర్‌ న్యూ–బెంగళూరు (06288) రైలు ఈ నెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 

నాందేడ్‌–పానిపట్‌ (07635) రైలు ఈ నెల 26న ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈ నెల 27న మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్‌ చేరుతుంది. 

పునరుద్ధరించిన రైళ్లు ఇవే... 
నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23–26 వరకు విజయవాడ–గుంటూరు (07783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580), నడికుడి–మాచర్ల (07579), మాచర్ల–గుంటూరు (07780), గుంటూరు–విజయవాడ(07788) రైళ్లను పున
రుద్ధరించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement