శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లు | SCR To Operate 60 Special Trains For Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లు

Nov 7 2025 2:15 PM | Updated on Nov 7 2025 3:02 PM

SCR To Operate 60 Special Trains For Sabarimala

సాక్షి, హైదరాబాద్‌: శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. 60 శబరిమల ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. బుకింగ్స్ ఇవాళ (నవంబర్‌ 7, శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. శబరిమల యాత్రికుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ యాత్రా సీజన్‌లో 60 ప్రత్యేక రైళ్లను నడపనుంది. యాత్రికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రత్యేక రైళ్లు మచిలీపట్నం, నర్సాపురం, చర్లపల్లి నుంచి కొల్లం వరకు నడుస్తాయి. రేణిగుంట, గూడూరు, గుంటూరు మార్గాల మీదగా నడవనున్నాయి. ఈ సేవలు నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయని ఎస్‌సీఆర్‌ ప్రకటించింది.

రైలు నంబర్‌ 07107: (చర్లపల్లి నుంచి కొల్లాం వరకు) నవంబర్‌ 17, 24.. డిసెంబర్‌ 1,8,15,22,29.. జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి.. మర్నాడు కొల్లాం చేరుకుంటాయి. పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి.
రైలు నంబర్‌ 07108: (కొల్లాం నుంచి చర్లపల్లి వరకు) నవంబర్‌ 19, 26.. డిసెంబర్‌ 3,10,17,24,31 తేదీల్లో.. జనవరి 7,14,21 తేదీల్లో కొల్లా నుంచి బయలుదేరి.. మర్నాడు చర్లపల్లి చేరుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement