ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ | Soon Promotions For APSRTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Sep 14 2021 8:01 AM | Updated on Sep 14 2021 10:53 AM

Soon Promotions For APSRTC Employees - Sakshi

ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతోంది. త్వరలో వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి.

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతోంది. త్వరలో వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువ పదోన్నతులు దక్కనున్నాయి. (చదవండి: Facebook: ఫేస్‌బుక్‌లో ఇష్టమొచ్చినట్లు డర్టీ పోస్టులు

మెకానిక్‌లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు.

చదవండి:
Andhra Pradesh: కోటి మందికి రెండు డోసులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement