తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిల్‌ దాఖలు | PIL Filed In AP High Court On Tirupati Stampede Incident | Sakshi
Sakshi News home page

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు

Jan 10 2025 1:23 PM | Updated on Jan 10 2025 1:51 PM

PIL Filed In AP High Court On Tirupati Stampede Incident

అమరావతి, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభాకర్‌ రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. 

భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రొటోకాల్‌ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలక్కిసలాటలో 29 మంది మృతి చెందిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు.

తిరుపతిలో వైకుంఠ ద్వార టోకెన్ల టికెట్‌ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీటీడీ నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతోనే ఇంతటి ఘోరం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement