దుర్గాఘాట్‌లో మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవం | Malleswara Swamy Varla Teppotsavam | Sakshi
Sakshi News home page

దుర్గాఘాట్‌లో మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవం

Oct 23 2023 7:03 PM | Updated on Oct 23 2023 7:53 PM

Malleswara Swamy Varla Teppotsavam - Sakshi

విజయవాడ: గంగాపార్వతీ సమేత మిమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవంలో భాగంగా స్వామి దుర్గాఘాట్‌లోని కృష్ణానదిలో హంసవాహనం జలవిహారం చేస్తున్నారు. మూడు మార్లు ఉత్సవవిగ్రహాలకు జలవిహారం చేయించనున్నారు. దుర్గాఘాట్‌ నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు.

హంసవాహనం పైనకేవలం 31 మందికి మాత్రమే  అనుమతి ఇచ్చారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల మధ్య తెప్పోత్సవం జరుగుతోంది. మూడేళ్ల తర్వాత భక్తులకు స్వామివారు నదీవిహారం చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో బాణా సంచా సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాఘాట్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి తెప్పోత్సవాన్నిభక్తులు వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement