భోజనంలో బల్లి.. కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత | KGBV teachers fall ill with food poison | Sakshi
Sakshi News home page

భోజనంలో బల్లి.. కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత

Jul 31 2025 4:57 AM | Updated on Jul 31 2025 4:58 AM

KGBV teachers fall ill with food poison

సుమారు 50 మందికి పైగా వాంతులు, విరేచనాలు

బాధితుల్లో గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు

తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో ఘటన

తెనాలి అర్బన్‌: శిక్షణ నిమిత్తం వచ్చిన కస్తూ­రిబా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యా­యినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం రాత్రి జరిగింది. సర్వశి­క్షా­అభియాన్‌ అధికారుల కథనం ప్రకారం..రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆర్ట్స్‌ ఉపాధ్యాయి­నులు సుమారు 200 మంది శిక్షణలో భాగంగా సోమవారం ఉదయం తెనాలి జేఎంజే మహిళా కళాశాలకు చేరుకున్నారు. వీరందరికీ సర్వశిక్షా­అభియాన్‌ అధికారులు అదే కళాశాల ఆవరణ­లో వసతి ఏర్పాటుచేశారు. 

వారికి ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యా­హ్నం, రాత్రికి భోజనం అందిస్తూ వచ్చారు.  బుధవారం రాత్రి కూడా ఉపాధ్యాయినులందరూ భోజ­నం చేశారు. అయితే, భోజనంలో బల్లి కనిపించిందని వారు ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం.. వారిలో 50 మందికి పైగా వాంతులు, విరేచ­నాలు అయినట్లు తెలిసింది. అస్వస్థతకు గురైన వారిలో బాలింతలు, గర్భిణులు, హార్టు పేషెంట్లు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ట్యాబ్‌లెట్లు ఇచ్చి సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

కానీ, వారిలో 10 మందికి వాంతులు, విరేచ­నాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. దీనిపై సర్వశిక్షాఅభియాన్‌ రాష్ట్ర అధికారి రవీంద్రారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఉపాధ్యాయి­నులు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement