కర్నూలులో వక్ఫ్‌బోర్డ్‌ ఏర్పాటు తగదు..  | It is not appropriate to set up a waqf board in Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో వక్ఫ్‌బోర్డ్‌ ఏర్పాటు తగదు.. 

Dec 11 2021 5:00 AM | Updated on Dec 11 2021 5:00 AM

It is not appropriate to set up a waqf board in Kurnool - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్‌ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ, మొగల్రాజపురానికి చెందిన మహ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు శుక్రవారం హైకోర్టును కోరారు.

అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీభానుమతి ధర్మాసనం తిరస్కరించింది. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 2016లో జారీచేసిన జీవో 18 ప్రకారం విజయవాడలో వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఎలాంటి సహేతుక కారణాల్లేకుండా కర్నూలులో వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement