ఏపీలో ‘థర్మల్‌’ ధగధగ | Government measures for people electricity needs: andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘థర్మల్‌’ ధగధగ

Apr 12 2024 5:19 AM | Updated on Apr 12 2024 5:19 AM

Government measures for people electricity needs: andhra pradesh - Sakshi

రాష్ట్ర ప్రజల విద్యుత్‌ అవసరాల కోసం ప్రభుత్వం చర్యలు

అధికారంలోకి రాగానే పెండింగ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులపై దృష్టి

ఒకే ఏడాదిలో రెండు ధర్మల్‌ ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపు

అందుబాటులోకి వచ్చిన 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

ప్లాంట్లు ఆగకుండా నిరంతరం బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు

చంద్రబాబు హయాంలో బొగ్గు కొరతతో తీవ్ర ఇబ్బందులు

నాడు
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్‌ హాలీడేలతో నరక యాతనే.

నేడు
కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్‌ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి.  

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్‌ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్‌ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి.

అవే ప్లాంట్లు జగన్‌ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి.  రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాç­ßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. 

గత ప్రభుత్వ అసమర్థత
శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్‌ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్‌ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్‌ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్‌ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది.  తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు.

అయితే స్టేజ్‌ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. 

జగన్‌ సర్కారు సమర్ధత
అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్‌ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌ (వీటీపీఎస్‌)లో 800 మెగావాట్ల యూనిట్‌ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్‌లో దానినీ అందుబాటులోకి తెచ్చారు.

బొగ్గు కొరతకు చెక్‌
దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు జగన్‌ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్‌ కోతలు విధించేది. 
► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్‌ సంస్థలు రాష్ట్రంలో థర్మల్‌ విద్యుదుత్పత్తికి సరి­పడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. 
►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌  వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. 

►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్‌ టన్నులు నిల్వ చేశారు. 
►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్‌ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్‌ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో పెట్టారు. 
►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్‌ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్‌ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. 

► కేంద్ర బొగ్గు, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. 
►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌), స్టేజ్‌–2లోని యూనిట్‌–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. 

►ఇది కాకుండా థర్మల్‌ కేంద్రాలకు ఎంసీఎల్‌ నుంచి ఏటా 17.165 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఏ) చేసుకుంది. 
►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు  డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డా.ఎన్‌టీటీపీఎస్‌), రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఆర్‌టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement