Good News for AP Outsourcing and Contract Employees - Sakshi
Sakshi News home page

ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Published Wed, Apr 12 2023 7:17 AM

Good News For Ap Outsourcing And Contract Employees - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు­త్వం శుభవార్త అందించింది. వారికి ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్‌ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ సౌకర్యాన్ని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా కల్పించాలన్న  ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి ఆమో­దం తెలిపారు. దీంతో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా ఐదు ప్రత్యేక సాధా­రణ సెలవులను మంజూరు చేస్తూ ఆరి్థకశాఖ జీవో నంబర్‌ 39 జారీచేసింది.

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెల­వులు మంజూరుచేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే!  

Advertisement
Advertisement