రైతులకు రూ.700 కోట్లు జమ | Girija Shankar said rabi had taken up grain purchases | Sakshi
Sakshi News home page

రైతులకు రూ.700 కోట్లు జమ

May 27 2022 5:40 AM | Updated on May 27 2022 8:38 AM

Girija Shankar said rabi had taken up grain purchases - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గురువారం తెలిపారు. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement