కాణిపాకం అభిషేకం టికెట్‌ ధరలపై దేవాదాయ శాఖ వివరణ | Endowment Department Clarity On Kanipakam Abhishekam Ticket Prices | Sakshi
Sakshi News home page

కాణిపాకం అభిషేకం టికెట్‌ ధరలపై దేవాదాయ శాఖ వివరణ

Oct 6 2022 6:17 PM | Updated on Oct 6 2022 7:13 PM

Endowment Department Clarity On Kanipakam Abhishekam Ticket Prices - Sakshi

సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ల ధరలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్పందించింది. రూ. 700 ఉన్న టికెట్‌ రూ. 5000కు పెంచేశారని వార్తలు రావడంతో అభిషేకం టికెట్‌ ధర పెరగలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ఆలయ అధికారుల అవగాహన రాహిత్యం వల్లే అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చేసినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్‌ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement