మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

CM YS Jagan Emotional Tweet On YSR Vardhanthi - Sakshi

సాక్షి, అమరావతి: తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ  నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
మహానేత వైఎస్సార్‌: నిలువెత్తు సంక్షేమ రూపం 
నిరుపేదల గుండె దీపం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top