సాక్షి,విజయవాడ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
పీపీపీ పనులు నెలరోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని సూచించారు. ఫేజ్ 1లో నాలుగు, ఫేజ్ 2లో ఆరు మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్పగించనుంది.
గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేట్ సంస్థలు స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


