దుబారాలో దూసుకుపోతున్న బాబు సర్కార్‌ | Chandrababu Govt Allocates rs45 Lakh for National Media Publicity | Sakshi
Sakshi News home page

దుబారాలో దూసుకుపోతున్న బాబు సర్కార్‌

Jun 2 2026 8:50 PM | Updated on Jun 2 2026 8:53 PM

Chandrababu Govt Allocates rs45 Lakh for National Media Publicity

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబారాలో ప్రభుత్వం దూసుకుపోతూ జాతీయ మీడియాలో ప్రచారానికి నిధులు విడుదల చేసింది. జాతీయ మీడియా పొగడ్తల కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టింది.

ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ప్రచారానికి 45 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇండియా టుడే, ది వీక్, ఔట్‌లుక్, బిజినెస్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో ప్రచార ప్రకటనలతో పాటు ఫీచర్ ఆర్టికల్స్ ప్రచురించినందుకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement