దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు | Chandrababu and Nara Lokesh Stories On Davos Tour | Sakshi
Sakshi News home page

దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు

Jan 28 2025 10:33 AM | Updated on Jan 28 2025 10:33 AM

Chandrababu and Nara Lokesh Stories On Davos Tour

మహారాణిపేట (విశాఖ): సీఎం చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరని, చర్చించి వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఓ కోర్టు కేసు నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. 

వైఎస్సార్‌సీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదని స్పష్టంచేశారు.  కాకినాడ పోర్టును అడ్డగోలుగా తుపాకీ పెట్టి లాక్కున్నారని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉన్నందున ఒక్కొక్కటిగా చేస్తున్నామన్నారు. ఈ ఏడు నెలల కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్‌ తెలిపారు. 

స్థిరమైన ప్రభుత్వంవల్లే పెట్టుబడులు 
ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్లే వారికి పెట్టుబడులు వస్తున్నాయని, స్థిరమైన ప్రభుత్వంవల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుందని చెప్పారు. జగన్‌ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు గ్యారంటీ అడుగుతున్నారని మంత్రి లోకేశ్‌ చెప్పారు.  దావోస్‌లో కాగ్నిజెంట్ ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశానని, త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి న్యూస్‌ వస్తుందన్నారు.  మరో 90 రోజుల్లో టీసీఎస్‌ వస్తుందని చెప్పారు.     కాలేజీల యాజమాన్యాలకే విద్యాదీవెన నిధులు చెల్లిస్తామన్నారు.  ఇక చంద్రబాబు ఏ బాధ్యతలిచ్చినా అహర్నశలు కష్టపడి పనిచేస్తానని, పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురానని లోకేశ్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement