బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు | Ayyappa Devotees Travel Bus Overturned Five People Injured | Sakshi
Sakshi News home page

బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు

Dec 7 2025 9:32 AM | Updated on Dec 7 2025 10:09 AM

Ayyappa Devotees Travel Bus Overturned Five People Injured

సాక్షి, తిరుపతి జిల్లా: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. 

గుంటూరు నుంచి శబరిమలైకి వెళ్తున్న బస్సు రైటర్ సత్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement