21న కలెక్టరేట్ల వద్ద, 25న విజయవాడ ధర్నాచౌక్ వద్ద ధర్నా
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం పోరాటానికి పీఆర్టీయూ సిద్ధమైంది. రాజమహేంద్రవరంలో ఆదివారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న విజయవాడ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.


