టీడీపీ నేత నారాయణను విచారిచేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతి

AP High Court allowed CID to Interrogate TDP leader Narayana - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.

సీఐడీ నోటీసులను సవాల్‌ చేస్తూ నారాయణ వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో నారాయణను సీఐడీ విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా సీఐడీ విచారణకు సహకరించాలని టీడీపీ నేత నారాయణను హైకోర్టు ఆదేశించింది. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ నుంచి గోపీకృష్ణ సస్పెన్షన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top