26న భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు | AP Government Support To Bharat Bandh On March 26th | Sakshi
Sakshi News home page

26న భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు

Mar 23 2021 8:53 PM | Updated on Mar 23 2021 9:38 PM

AP Government Support To Bharat Bandh On March 26th - Sakshi

సాక్షి, అమరావతి : ఈనెల 26న  నిర్వహించే భారత్‌ బంద్‌కు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు.

చదవండి: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్’‌పై సీఎం జగన్‌ సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement