జీవో నంబర్‌-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ | AG Arguments In High Court On Petition Of AP G.O Number-1 | Sakshi
Sakshi News home page

జీవో నంబర్‌-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ

Jan 12 2023 12:23 PM | Updated on Jan 12 2023 3:01 PM

AG Arguments In High Court On Petition Of AP G.O Number-1 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్‌-1పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్‌ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్‌ బెంచ్‌ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement