
‘అపూర్వ’ సమ్మేళనం
ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరులోని కాటవెంకటప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978–79లో పదో తరగతి చదువుకున్న వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నాగరాజుశర్మ, దత్తాత్రేయశర్మ, అక్కులప్ప, హనమంతప్ప తదితర ఉపాధ్యాయులకు పాదపూజ చేసి, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.