
మట్టి దోపిడీని అరికట్టేవారేరీ?
పెద్దవడుగూరు : కూటమి పాలనలో అభివృద్ధి పనుల మాటున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా అభివృద్ధి పనుల కోసం అయితే ఇసుక, మట్టి తరలించుకునేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. అయితే ఎటువంటి అనుమతులు లేకున్నా మండల కేంద్రం పెద్దవడుగూరు సమీపంలోని దేవదాయ భూముల్లో జేసీబీ సాయంతో నాణ్యమైన ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడినా అధికారులెవ్వరూ ఇటువైపు తొంగిచూసిన దాఖలాలు లేవు. ఇక పి.వీరన్నపల్లి, కొండూరు, చిత్రచేడు గ్రామాల నుంచి పెన్నానది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక పెద్ద ఎత్తున తవ్వి తీసుకెళ్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ స్టేషన్ మీదుగాను ఎర్రమట్టి లోడ్లతో వాహనాలు వెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
అనుమతి లేకున్నా దేవదాయ భూమిలో ఎర్రమట్టి తవ్వకం
రాత్రికి రాత్రే తరలించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు
ఇసుకను కొల్లగొడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

మట్టి దోపిడీని అరికట్టేవారేరీ?