చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 7:43 AM

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ

చోడవరం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ అన్నారు. చోడవరం చైతన్య బీఈడీ కాలేజీలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు చట్టాలపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలు తెలుసుకోవడం వల్ల నేరాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.గౌరీశంకరరావు, సీఐ పి.అప్పలరాజు, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, న్యాయవాది ఎం.జ్యోతి, కాలేజీ కరస్పాండెంట్‌ లోవరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement