పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెద్ద సవాలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెద్ద సవాలు

Mar 16 2025 2:08 AM | Updated on Mar 16 2025 2:04 AM

● దుకాణదారులు పాలిథిన్‌ కవర్లు విక్రయించరాదు ● వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్‌ ఆదేశం

నర్సీపట్నం: ప్లాస్టిక్‌ వినియోగాన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. నర్సీపట్నంలో ఉన్న దుకాణదారులకు ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించవద్దని నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్రను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలన్నారు. ఇటీవల కాలంలో నర్సీపట్నంలో నాటు వైద్యులు పెరిగారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కొంతమంది డాక్టర్లు మత్తు ఇంజక్షన్లు కూడా ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో రూ.14.11 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులు అందజేస్తామన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్‌ రామారావు, కౌన్సిలర్లు సిహెచ్‌.పద్మావతి, రాజేష్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

అచ్యుతాపురం రూరల్‌: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం కాపాడుకోగలమని కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెలుపాక జగన్నాథపురంలో పర్యటించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగానికి స్వస్తి పలుకుదాం’ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. జేసీ జాహ్నవి, ఆర్డీవో, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెద్ద సవాలు 1
1/1

పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెద్ద సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement