● ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు
పాడేరు : వైఎస్సార్సీపీ అదిష్టానం ఆదేశాల మేరకు ఈనెల రెండో తేదీన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.


