సిర్పూర్(టి): మహారాష్ట్రలోని సరిహద్దు గ్రా మమైన పోడ్సా గ్రామంలో ఆవు డూడలను కొనుగోలు చేసి వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకట్రావ్పేట్ స మీపంలో ఆదివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చే యగా నాలుగు ఆవు దూడలు ఉన్నాయి. వా టిని గోలేటి గోశాలకు, వాహనాన్ని సిర్పూర్(టి) పోలీసుస్టేషన్కు తరలించారు. అక్రమ రవాణా చేస్తున్న మహ్మద్కై ఫ్, అబ్దుల్ కరీం కుర్షి, ఖాజా యాకూబొద్దీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


